వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

ABN , First Publish Date - 2020-08-04T10:20:30+05:30 IST

మూడు రాజధానులకు మద్ధతుగా జిల్లా కేంద్రంలో వైసీపీ నా యకులు సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టా రు. ఏడు రోడ్ల ..

వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 3 : మూడు రాజధానులకు మద్ధతుగా జిల్లా కేంద్రంలో వైసీపీ నా యకులు సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టా రు. ఏడు రోడ్ల జంక్షన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ మూడు రాజఽ దానులతో ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అంధవరపు సూరిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


రణస్థలం : రాష్ట్రం మూడు రాజధానులతో అన్ని విధాలా అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం రాత్రి స్థానిక వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ రహ దారిపై కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామారావు, సా యిరాం, తిరుపతిరావు, సీతారాంతో పాటు అధికసం ఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


కంచిలి: మూడు రాజధానులు ప్రకటించిన ముఖ్యమంత్రి  జగన్‌మ్మోహన్‌రెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలంతా రుణపడి ఉంటారని  ఇచ్ఛాపురం నియోజకవర్గ మహిళా కన్వీనర్‌ పిరియా విజయ అన్నారు. ఈమేరకు సోమవారం రాత్రి కంచిలి టౌన్‌ పరిధిలో మూడు రాజధానులకు మద్దతుగా   కాగడాల ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో నాలుగు మండలాలు, మున్సిపాల్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:20:30+05:30 IST