ఉగ్రవాదుల దాడి...ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఓ పౌరుడికి గాయాలు

ABN , First Publish Date - 2020-07-01T14:49:39+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లతోపాటు ఓ పౌరుడు గాయపడ్డారు.....

ఉగ్రవాదుల దాడి...ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఓ పౌరుడికి గాయాలు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో బుధవారం ఉదయం పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లతోపాటు ఓ పౌరుడు గాయపడ్డారు. సోపోరీ పట్టణంలోని మోడల్ టౌన్ ప్రాంతంలో  సీఆర్‌పీఎఫ్ జవాన్లు వాహనాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్ర జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ చెప్పారు. 

Updated Date - 2020-07-01T14:49:39+05:30 IST