అమెరికాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురు మృతి!

ABN , First Publish Date - 2021-05-04T16:45:41+05:30 IST

అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రం మియామీలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు మియామీ పోలీస్ అధికారులు తెలిపారు.

అమెరికాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురు మృతి!

మియామీ: అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రం మియామీలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు మియామీ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు తప్పించుకుని ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం 5 గంటల(అమెరికా కాలమానం ప్రకారం).. కాల్పులు జరిగిన పొరుగింటి నుంచి పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందింది. వారి సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో నుంచి ఓ వ్యక్తి​ గాయాలతో బయటకు పరుగులు తీయడం చూశారు. ఆ వ్యక్తి తన కొడుకే కాల్పులకు తెగబడినట్లు పోలీసులకు తెలిపాడు. దాంతో పోలీసులు ఇంట్లో ఉన్న నిందితుడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-04T16:45:41+05:30 IST