సింగపూర్‌లో ముగ్గురు భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు క‌రోనా

ABN , First Publish Date - 2020-04-05T20:16:07+05:30 IST

సింగాపూర్‌లో ఆదివారం కొత్త‌గా 42 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

సింగపూర్‌లో ముగ్గురు భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు క‌రోనా

సింగపూర్‌ సిటీ: సింగపూర్‌లో ఆదివారం కొత్త‌గా 42 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో సింగపూర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన వారి సంఖ్య 844కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, కొత్త‌గా న‌మోదైన 42 క‌రోనా పాజిటివ్ కేసుల్లో ముగ్గురు భార‌త సంత‌తి వ్య‌క్తులు ఉన్నార‌ని అధికారులు తెలియ‌జేశారు. లాంగ్ ట‌ర్మ్ పాస్ క‌లిగిన 35 ఏళ్ల మ‌హిళ‌, వ‌ర్క్ పాస్ క‌లిగిన 34 ఏళ్ల వ్య‌క్తితో పాటు సింగపూర్ ప‌ర్మినెంట్ రెసిడెంట్‌, సెంగ్‌కాంగ్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ప‌నిచేసే న‌ర్స్‌(42)కు క‌రోనా సోకింద‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 24న క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన న‌ర్స్‌కు 27న క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈమెకు ఎలాంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదు. మిగ‌తా ఇద్ద‌రు మాత్రం ఇటీవ‌లే ఇండియా నుంచి సింగాపూర్ వ‌చ్చార‌ని అధికారులు గుర్తించారు.   

Updated Date - 2020-04-05T20:16:07+05:30 IST