అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం..!

ABN , First Publish Date - 2021-05-07T16:03:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాహో రాష్ట్రంలోని ఓ పాఠశాలలో గురువారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం..!

ముగ్గురికి గాయాలు

ఇదాహో: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇదాహో రాష్ట్రంలోని ఓ పాఠశాలలో గురువారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇదాహోలోని రిగ్బి మిడిల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరోకరు స్కూల్ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-05-07T16:03:13+05:30 IST