వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-02-28T11:15:41+05:30 IST

బాల్కొండ 44వ జాతీ య రహదారిపై గురువారం ఐదుగురు కూలీలతో వెళు ్తన్న ట్రాక్టర్‌ను లారీ వెనుక

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. 


 బాల్కొండ, ఫిబ్రవరి27: బాల్కొండ 44వ జాతీ య రహదారిపై గురువారం ఐదుగురు కూలీలతో వెళు ్తన్న ట్రాక్టర్‌ను లారీ వెనుక నుంచి ఢీ కొన్న ఘటనలో కూలీ సయ్యద్‌ అహ్మద్‌(28) అక్కడికక్కడే మృతి చెంది నట్లు బాల్కొండ ఎస్సై శ్రీహరి తెలిపారు. ఈ సంఘట నకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిట్టాపూర్‌కు గ్రామా నికి చెందిన గోజూర్‌ గంగాధర్‌ తన డైవర్‌ ట్రాక్టర్‌లో బాల్కొండ నుంచి ఐదుగురు కూలీలను పసుపు ఉడికి ంచేందుకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యంలోని హెచ్‌పీ పెట్రోల్‌ పంపు వద్ద నిర్మల్‌ నుంచి వస్తున్న లారీ (ఏపీ 05టీడీ 1028) వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొంది.


దీంతో ట్రాక్టర్‌ ట్రాలీ, ఇంజన్‌ విడిపోయి ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీలో ఉన్న బైంసాకు చెందిన కూలీ సయ్య ద్‌ అహ్మద్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ చంద్రె దయానంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగా త్రుడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిం చారు. స్వల్పంగా గాయపడ్డ మిగతా ముగ్గురు కూలీలు షేక్‌ సలీం, షేక్‌ అమీర్‌, షేక్‌ ఫరీద్‌ను బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ట్రాక్టర్‌ యజమాని గోజూర్‌ గంగాఽ దర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ఫ్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  


లారీ, బైకు ఢీ

ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని దేవితండా వద్ద, 44వ జాతీయ రహదారిపై గురు వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మైసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.  వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన వ్యక్తి నిజామాబాద్‌ వైపు నుంచి తన స్వగ్రామమైన సదాశివనగర్‌ మండలంలోని వజ్జపల్లికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో దేవితండా వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో డివైడర్‌ను ఢీకొని తల పగిలి అక్కడిక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు మైస య్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గత పది సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం సదాశివనగర్‌ నుంచి వజ్జపల్లికి వచ్చి జీవిస్తున్నారని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


స్కూల్‌ బస్సు ఢీకొని..

ఆర్మూర్‌రూరల్‌: ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ లోని 63వ జాతీయరహదారిపై గురువారం ప్రైవేటు బ స్సు ఢీకొని అంకాపూర్‌కు చెందిన అలకుంట గురు వయ్య (68) మృతి చెందాడు. ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌కు చెందిన బస్సు నిజామాబాద్‌ నుంచి మోర్తాడ్‌కు వెళ్తుండగా అంకా పూర్‌ వద్ద కారును ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో నడుచు కుంటు వెళ్తున్న గురువయ్య ఢీకొట్టింది. తలకు తీవ్రగా యాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.


అన ంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. బస్సు డ్రైవర్‌ను అదు పులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు.

Updated Date - 2020-02-28T11:15:41+05:30 IST