భవనం కూలి ముగ్గురు కార్మికుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-06-21T11:57:48+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ గంగా సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన...
బికనేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ గంగా సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని బికనేర్ జిల్లా కలెక్టరు నమిత్ మెహతా చెప్పారు. కూలిన భవనంలో మద్యం దుకాణం తెరవాలని యజమానులు భావించగా స్థానికులు దాన్ని వ్యతిరేకించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.భవనం కూలిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.