కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
ABN , First Publish Date - 2021-04-09T06:43:41+05:30 IST
జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గురువారం షోపియాన్ పట్టణంలోని బాబా మొహల్లా ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడం తో బలగాలు గాలింపు చేపట్టాయి
శ్రీనగర్, ఏప్రిల్ 8: జమ్మూకశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గురువారం షోపియాన్ పట్టణంలోని బాబా మొహల్లా ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడం తో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ముగు ్గరు ముష్కరులు హతమయ్యారని, ఓ జవాను గాయపడ్డారని అఽధికారులు చెప్పారు. హతులైన ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.