ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురికి..
ABN , First Publish Date - 2020-07-04T10:22:07+05:30 IST
ఖమ్మం జిల్లాలో శుక్రవా రం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి విడుదల చేసిన హెల్త్బులిటెన్లో
హెల్త్ బులిటెన్ విడుదల చేసిన జిల్లా వైద్యశాఖ
ఖమ్మం సంక్షేమవిభాగం, జూలై 3 : ఖమ్మం జిల్లాలో శుక్రవా రం మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నుంచి విడుదల చేసిన హెల్త్బులిటెన్లో పేర్కొన్నారు. కానీ నమోదు జరిగిన కేసుల్లో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేం ద్రానికి చెందిన వ్యక్తి కాగా మరో వ్యక్తి హైదరాబాద్లో ఐదేళ్లుగా నివాసం ఉంటూ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఖమ్మం చిరునామాతో నమోదు చేసి నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి పేర్కొన్నారు.
అలాగే గతంలో పాజిటివ్ వచ్చిన జిల్లా ఆసుపత్రి నర్సింగ్ ఉద్యోగి కూతురికి కూడా పాజిటివ్ నిర్ధారణైంది. మార్చి నెలలో 105కరోనా నిర్ధారణ పరీక్షలు జర పగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తర్వాత మేలో 627 పరీక్షలు జరపగా ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాత అనూహ్యంగా జూన్ నెల నుంచి జూలై 3వరకు ఏకంగా 50కరోనా కేసులు నమోదవగా మరో 98 మంది ఫలితాలు రావాల్సి ఉంది.