హుజురాబాద్ ఉపఎన్నికకు మూడు నామినేషన్లు
ABN , First Publish Date - 2021-10-06T22:41:52+05:30 IST
హుజురాబాద్ ఉపఎన్నికకు ఈ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి.
హుజురాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికకు ఈ రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 8న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ డమ్మీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ సతీమణి జమున పేరిట ఆ పార్టీ కార్యకర్తలు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా చిల్వేరు శ్రీకాంత్, రేగుల సైదులు నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 30న పోలింగ్, నవంబరు 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. నవంబరు 5తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.