గ్రాన్యూల్స్‌ కొనుగోలు రేసులో మూడు పీఈ దిగ్గజాలు

ABN , First Publish Date - 2020-09-25T06:05:22+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్‌ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు కేకేఆర్‌ అండ్‌ కో, బెయిన్‌ క్యాపిటల్‌, బ్లాక్‌స్టోన్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం...

గ్రాన్యూల్స్‌ కొనుగోలు రేసులో మూడు పీఈ దిగ్గజాలు

ముంబై: హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్‌ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలుకు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు కేకేఆర్‌ అండ్‌ కో, బెయిన్‌ క్యాపిటల్‌, బ్లాక్‌స్టోన్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ 3 పీఈ సంస్థలు  నాన్‌ బైండింగ్‌ (విధిగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని) బిడ్లు కూడా సమర్పించినట్లు తెలిసింది.  గ్రాన్యూల్స్‌ ప్రమోటర్లు మెజారిటీ వాటా విక్రయం ద్వారా కంపెనీ యాజమాన్యం నుంచి వైదొలిగే ప్రయత్నాల్లో ఉన్నారు. కొనుగోలుదారులను వెతికే బాధ్యతలను కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌కు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు గ్రాన్యూల్స్‌తోపాటు పీఈ సంస్థలూ నిరాకరించాయి.

Updated Date - 2020-09-25T06:05:22+05:30 IST