Pakistan : మందుపాతర పేలి ముగ్గురు సైనికుల మృతి

ABN , First Publish Date - 2021-08-27T13:49:07+05:30 IST

పాకిస్థాన్ దేశంలో జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు...

Pakistan : మందుపాతర పేలి ముగ్గురు సైనికుల మృతి

బలోచిస్థాన్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో జరిగిన మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. బలోచిస్థాన్ ప్రావిన్సులోని జియారత్ జిల్లా మంగీ డ్యాం ప్రాంతంలో పాకిస్థాన్ పారామిలటరీ దళం వాహనంలో వస్తుండగా రోడ్డు పక్కన పెట్టిన మందుపాతరను పేల్చారు. ఈ మందుపాతర పేలుడులో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు, భద్రతా బలగాలు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి  క్షతగాత్రులైన సైనికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పాక్ సైనికులు వాహనంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఆగంతకులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటన అనంతరం పోలీసులు, సైనికులు కలిసి ఈ డ్యాం ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ మందుపాతరను ఎవరు పేల్చారన్నది ఇంకా తేలలేదు. 


Updated Date - 2021-08-27T13:49:07+05:30 IST