గోదావరిలోని దీవిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు

ABN , First Publish Date - 2020-10-19T01:37:00+05:30 IST

గోదావరిలోని దీవిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు

గోదావరిలోని దీవిలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపరులు

నిర్మల్: గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో పలు పట్టణాలతోపాటు కొన్ని గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి.


ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం మునిపెల్లి దగ్గర గోదావరిలోని దీవిలో ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. 400 గొర్రెలతో 3 రోజుల క్రితం మేత కోసం వెళ్లి దీవిలో కాపరులు చిక్కుకుపోయారు. శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

Updated Date - 2020-10-19T01:37:00+05:30 IST