స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రిలో తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం!

ABN , First Publish Date - 2020-08-10T22:15:34+05:30 IST

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై

స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రిలో తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం!

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై మూడు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. రమేష్ ఆస్పత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్‌లో ఒక బృందం తనిఖీలు చేస్తోంది. ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు తీసుకుంటున్న ప్రమాణాలపై కూడా దర్యాప్తు చేస్తోంది. మరోబృందం షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలపై తనిఖీలు చేస్తోంది. మూడవ బృందం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది. సోమవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

 

కీలక పత్రాలు స్వాధీనం!

స్వర్ణ ప్యాలెస్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిలోపలికి పోలీసులు ఎవరినీ అనుమతించట్లేదు. అగ్రిమెంట్‌కు సంబంధించి కీలకమైన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఫైర్ నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాలు మరియు షార్ట్ సర్య్కూట్‌కు గల కారణాలపై అధికారులు, పోలీసులు పరిశీలిస్తున్నారు.


స్వర్ణప్యాలెస్, స్వర్ణ హైట్స్‌లో విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది పరిశీలించారు. మరోవైపు.. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ ట్రీట్‌మెంట్‌పై వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. స్వర్ణ హైట్స్, స్వర్ణ ప్యాలెస్ సంబంధించి నిబంధనల ప్రకారం నిర్మాణ కొలతలు ఉన్నాయా..? లేదా..? అని పోలీస్, అగ్నిమాపక అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా కమిటీ

ఇదిలా ఉంటే.. స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని జిల్లా కమిటి బృందం పరిశీలించింది. సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, జిల్లా జాయిట్ కలెక్టర్ (అభివృద్ధి) శివ శంకర్, విఎంసీ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పరిశీలించారు. ఈ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి వారు ఓ నివేదికను అందించనున్నారని తెలుస్తోంది.

Updated Date - 2020-08-10T22:15:34+05:30 IST