మూడువేలూ దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2021-05-21T07:19:55+05:30 IST

జిల్లాలో గడచిన 24 గంటల్లో 3185 కరోనా పాజిటివ్‌ కేసులు, 17 కొవిడ్‌ మరణాలూ నమోదయ్యాయి.

మూడువేలూ దాటేశాయ్‌!
చిత్తూరులో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నా జనానికి పట్టడం లేదు. గురువారం ఉదయం పండ్ల వీధిలో కిక్కిరిసిన జనమే ఇందుకు నిదర్శనం

పెరిగిపోతున్న కరోనా కేసులు   

రాష్ట్రంలోనే అత్యధికంగా 17 మరణాలు


తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటల్లో 3185 కరోనా పాజిటివ్‌ కేసులు, 17 కొవిడ్‌ మరణాలూ నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో గుర్తించిన పాజిటివ్‌ కేసులు, సంభవించిన మరణాలలో ఇవే అత్యధికం. మరోవైపు రోజువారీ కేసుల సంఖ్య చూస్తే జిల్లాలో నమోదైన కేసులు రాష్ట్రంలో రెండవ అత్యధికం కాగా మరణాలు మాత్రం రాష్ట్రంలోనే అత్యధికం కావడం గమనార్హం. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 167043కు చేరుకోగా గురువారం ఉదయానికి 23967 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నట్టు ప్రభుత్వ బులెటిన్‌ పేర్కొంది. ఇక మరణాల సంఖ్య 1137కు చేరాయి. కాగా గడచిన 24 గంటల్లో గుర్తించిన కేసులు తిరుపతి నగరంలో 338, చిత్తూరులో 322, మదనపల్లెలో 200, శ్రీకాళహస్తిలో 171, తిరుపతి రూరల్‌లో 127, బంగారుపాలెంలో 125, పీలేరులో 116 వున్నాయి. పుత్తూరులో 94, పూతలపట్టులో 91, చంద్రగిరిలో 89, తవణంపల్లెలో 84, ఐరాలలో 81, పలమనేరులో 68, పాకాలలో 67, కలికిరిలో 49, రేణిగుంటలో 48, సత్యవేడులో 45, నగరిలో 42, పెనుమూరు, యాదమరి మండలాల్లో 39 వంతున, తొట్టంబేడులో 37, కుప్పం, రొంపిచెర్ల, వరదయ్యపాలెం మండలాల్లో 36 చొప్పున, చిన్నగొట్టిగల్లు, ఏర్పేడు మండలాల్లో 35 వంతున, కేవీబీపురంలో 33, రామకుప్పంలో 32, పీటీఎంలో 31, సోమలలో 30, జీడీనెల్లూరు, గుడిపాల, తంబళ్ళపల్లె, వాల్మీకిపురం, పుంగనూరు మండలాల్లో 29 చొప్పున, కురబలకోటలో 28, గంగవరం, నారాయణవనం మండలాల్లో 27 చొప్పున, వెదురుకుప్పంలో 25, కలకడ, కేవీపల్లె, పులిచెర్ల మండలాల్లో 22 వంతున, వి.కోటలో 21, నాగలాపురంలో 20, గుడుపల్లెలో 19, బైరెడ్డిపల్లెలో 18, బి.కొత్తకోటలో 16, పిచ్చాటూరు, విజయపురం మండలాల్లో 15 వంతున, రామచంద్రాపురం, సదుం మండలాల్లో 14వంతున, కార్వేటినగరం, రామసముద్రం మండలాల్లో 13 చొప్పున, గుర్రంకొండ, వడమాలపేట మండలాల్లో 12 వంతున, బీఎన్‌ కండ్రిగ, నిండ్ర మండలాల్లో 11 చొప్పున, నిమ్మనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో 10 చొప్పున, పెద్దపంజాణి, శ్రీరంగరాజపురం మండలాల్లో 9 వంతున, చౌడేపల్లె, ఎర్రావారిపాలెం మండలాల్లో 8 వంతున, ములకలచెరువు, శాంతిపురం మండలాల్లో 5 చొప్పున, పాలసముద్రంలో 3 చొప్పున నమోదయ్యాయి.


ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో  1513 పడకల ఖాళీ 

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 11  గంటల వరకు 1513 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. విష్ణు నివాసంలో 455, శ్రీనివాసంలో 640, రుయాలో నాన్‌ ఆక్సిజన్‌ 163, రుయా చిన్నపిల్లల కొవిడ్‌ వార్డులో ఆక్సిజన్‌ 6, నాన్‌ ఆక్సిజన్‌ 7,  ఈఎ్‌సఐ ఆస్పత్రిలో నాన్‌ ఆక్సిజన్‌ 55, ఆయుర్వేద వైద్యశాలలో నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ 42 అందుబాటులో ఉన్నాయి. టీటీడీ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన మాధవంలో 145 పడకలు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-05-21T07:19:55+05:30 IST