నగరంలో ముగ్గురు యువకుల వీరంగం..!

ABN , First Publish Date - 2021-05-18T05:19:11+05:30 IST

నగరం లోని శ్రీనివాస్‌నగర్‌లో ముగ్గురు యువ కులు వీరంగం సృష్టించారు.

నగరంలో ముగ్గురు యువకుల వీరంగం..!
దాడి చేసిన యువకుడిని పట్టుకున్న బాధితుడు

దారిలో వెళుతున్న తండ్రీ కొడుకుపై దాడి

అనంతపురం క్రైం, మే17 : నగరం లోని శ్రీనివాస్‌నగర్‌లో ముగ్గురు యువ కులు వీరంగం సృష్టించారు. ఏకంగా సరదా కోసం వీడియోలు తీస్తున్న వా రు...  దారిలో వెళుతున్న ఓ తండ్రి, కొ డుకుపై దాడికి పాల్పడ్డారు.  త్రీటౌన పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. నల్లమాడ మండలం కొత్తపల్లి తండా గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌ నా యక్‌.. తన తండ్రి మంగేనాయక్‌, కుమా రుడితో కలిసి సోమవారం నగరంలోని వారి బంధువుల ఇంటికి బయలు దేరారు.  అక్కడి నుంచి బస్సులో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. అక్కడి నుంచి శ్రీనివాసనగర్‌ మీదుగా కాలినడకన వస్తున్నారు. శ్రీనివాసనగ్‌ మధ్యలోకి రాగానే.. ఆ సమయంలో అదే కాలనీకి చెందిన ముగ్గురు యువకులు(చింటూ, ఖలందర్‌ నాయుడు, బాబా) కలిసి సరదా కోసం (ప్రాంక్లీంగ్‌) వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమోకానీ వీడియో తీస్తున్న ఆ ముగ్గురిలో ఒకడు కర్రతో మంగేనాయక్‌ను బాదాడు. దీంతో వెంటనే అశోక్‌నాయక్‌ నిలదీయడంతో ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసింది. ముగ్గురు యువకులు కలిసి ఇటుకపెళ్లతో తండ్రి, కొడుకుపై దాడి చేయడంతో కాసేపు ఆ ప్రాంతంలో అలజడి వా తావరణం నెలకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రీటౌన పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. గాయపడిన అశోక్‌కుమార్‌నాయక్‌, మంగే నాయక్‌ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా శ్రీని వాస్‌నగర్‌లో ఆకతాయిల ఆకృత్యాలు హెచ్చుమీరాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన పోలీసులు ఇలాంటి వాటిపై దృష్టిసారించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-18T05:19:11+05:30 IST