APలో 10 జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ABN , First Publish Date - 2022-06-06T13:56:57+05:30 IST

రాష్ట్రంలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగు హెచ్చరికను జారీ చేసింది.

APలో 10 జిల్లాలకు పిడుగు హెచ్చరిక

అమరావతి: రాష్ట్రంలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగు హెచ్చరికను జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు - గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-06-06T13:56:57+05:30 IST