తీహార్ జైలు డైరెక్టరు జనరలుకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-25T15:02:33+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తీహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయల్ కు కరోనాపాజిటివ్ అని తేలింది....

తీహార్ జైలు డైరెక్టరు జనరలుకు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తీహార్ జైలు డైరెక్టరు జనరల్ సందీప్ గోయల్ కు కరోనాపాజిటివ్ అని తేలింది. తీహార్ జైలులో గతంలో పలువురు ఖైదీలు, జైలు సిబ్బందికి కరోనా సోకింది. కరోనా వల్ల జైలులో పలువురు మరణించారు. కరోనా సోకిన తీహార్ జైలు డైరెక్టరు జనరలును ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో ఒక్క గురువారం రోజే 30,836 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 2.2లక్షల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా వల్ల 5,087 మంది మరణించారు.

Updated Date - 2020-09-25T15:02:33+05:30 IST