షార్ట్సర్క్యూట్తో టింబర్ డిపో దగ్ధం
ABN , First Publish Date - 2022-01-22T05:16:11+05:30 IST
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ టింబరు డిపోలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి దగ్ధమైంది.
ధర్మవరం, జనవరి 21: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ టింబరు డిపోలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి దగ్ధమైంది. వివరాల మేరకు... పట్టణానికి చెందిన బాబాఫకృద్దీన్ టింబరు డిపోను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే శుక్రవారం ఉన్నఫలంగా డిపోలో విద్యుత్ షార్ట్స ర్క్యూట్తో మంటలు చెలరేగి డిపో అంతా అలుముకున్నాయి. ఇది గమ నిం చిన స్థానికులు డిపో యజమానికి, ద్వారా అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వా రా సమాచారం అందిం చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అర్పివే శారు. అప్పటికే డిపోలో ఉన్నసామగ్రి, మిషన్లతో పాటు విలువైన వస్తువులు కాలిపోయాయి. దీంతో రూ.35లక్షల నుండి రూ.40 లక్షల దాకా నష్టం వాటిల్లిన ట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే ఆదు కోవాలని విజ్ఞప్తి చేశాడు.