సమయం పాటించాల్సిందే
ABN , First Publish Date - 2020-07-03T10:32:08+05:30 IST
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేసే వైదిక, పరిపాలన సిబ్బంది సమయం తప్పక పాటించాలని దేవస్థానం ఈవో
ఆదాయం ఎలా పెంచాలో సలహాలు ఇవ్వండి
అక్రమాలు చేస్తే సహించేది లేదు
సిబ్బందితో భద్రాద్రి దేవస్థానం ఈవో రమాదేవి
భద్రాచలం, జూలై 2: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పని చేసే వైదిక, పరిపాలన సిబ్బంది సమయం తప్పక పాటించాలని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి సూచించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె తొలుత ఈవో కార్యాలయంలో పరిపాలనా సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ విధి నిర్వహణలో నిబద్దత, నిజాయితీతో పని చేయాలని సూచించారు. అలాగే దేవస్థానం ఆదాయాన్ని ఎలా పెంచవచ్చో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆమె సిబ్బందిని కోరారు. విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. భద్రాద్రి దేవస్థానానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఉన్న భూముల ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. వసతి గదుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో సరి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. వైదిక సిబ్బందితోనూ సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.