ఆ ప్రాజెక్టే మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక: శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-09-24T17:15:22+05:30 IST
ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్ను పూర్తి చెయ్యాలనేది మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక అని తనయుడు డీకే శ్రీనివాస్ తెలిపారు.
తిరుమల: ఆనంద నిలయం అనంతస్వర్ణమయం ప్రాజెక్ట్ను పూర్తి చెయ్యాలనేది మా నాన్న ఆదికేశువులు చివరి కోరిక అని తనయుడు డీకే శ్రీనివాస్ తెలిపారు. గురువారం సీఎం జగన్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కారణాలతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందన్నారు. ఈ ప్రాజెక్ట్ను పూర్తి చెయ్యాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీఎం నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు. పార్టీ మార్పు విషయంపై ప్రస్తుతం చర్చించలేదన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చెయ్యడమే లక్ష్యమని... రాజకీయ భవిష్యత్ గురించి తరువాత మాట్లాడుతానని డీకే శ్రీనివాస్ పేర్కొన్నారు.