సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి

ABN , First Publish Date - 2021-10-15T06:57:13+05:30 IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు.

సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి

తిరుమల, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. సాధారణంగా ఎనిమిదోరోజు ఉదయం మహారథోత్సవాన్ని మాడవీధుల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే కొవిడ్‌ కారణంగా దానిస్థానంలో సర్వభూపాలవాహన సేవ నిర్వహించారు. విశేష అలంకరణతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు పూర్తిచేశారు. సర్వభూపాల వాహనాన్ని రథం రూపంలో అలంకరించడం ఆకర్షణీయంగా నిలిచింది. రాత్రి అశ్వవాహనంపై శ్రీవారు క్షటాక్షించారు. దీంతో వాహన సేవలు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం చక్రస్నానం, రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తికానున్నాయి. 

Updated Date - 2021-10-15T06:57:13+05:30 IST