తిరుమలలో రోడ్డు ప్రమాదం.. చనిపోతూ బిడ్డకు జన్మచ్చిన జింక
ABN , First Publish Date - 2022-01-25T02:03:27+05:30 IST
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జింకను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో జింకను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో జింక మృతి చెందింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు 7వ మైల్ సమీపంలో రోడ్డుపై వున్న జింకను ఢీ కొట్టగా జింక మృతి చెందుతూ బిడ్డకు జన్మనిచ్చింది. జింక మృతి చెందిన విషయాన్ని ఘాట్లో వెళ్తున్న పలువురు భక్తులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందజేశారు. అంతేకాదు అప్పుడే జన్మించిన జింక పిల్లకు సపర్యలు చేసి కాపాడారు.