తిరుమలలో విషాదం... కరోనాతో అర్చకుడు మృతి

ABN , First Publish Date - 2020-08-06T23:17:01+05:30 IST

తిరుమలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి చెందారు. అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి

తిరుమలలో విషాదం... కరోనాతో అర్చకుడు మృతి

తిరుమల: తిరుమలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి చెందారు. అర్చకుడు కొద్ది రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. అర్చకుడికి వారం క్రితం కరోనా నిర్ధారణ కావడంతో వైద్యం కోసం టీటీడీ స్విమ్స్‌కు తరలించింది. ఆయన స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందారు. అర్చకుడు మృతి చెందడంతో టీటీడీలో తీవ్ర విషాదంలో అర్చకులున్నారు.


ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసా చార్యులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-06T23:17:01+05:30 IST