Tirumala శ్రీవారి సమాచారం
ABN , First Publish Date - 2022-01-15T13:57:14+05:30 IST
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 37,304 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 9,645 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.2.13 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు భక్తులకు దర్శనానికి అనుమతినిస్తున్నారు.