గరుడ వాహన సేవ రోజే తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షం

ABN , First Publish Date - 2020-09-23T19:45:56+05:30 IST

తిరుపతి: తిరుమల నేడు శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది.

గరుడ వాహన సేవ రోజే తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షం

తిరుపతి: తిరుమలలో నేడు శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహన సేవ జరిగింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. జిల్లా కోర్టు ఆవరణలో గరుడ పక్షి కనిపించింది. ఎగరలేని స్థితిలో ఉన్న అరుదైన పక్షిని లాయర్లు అందరూ వింతగా చూశారు. సమాచారాన్ని ఏబీఎన్ సిబ్బందికి తెలిపారు.


అరుదైన పక్షి అపస్మారక స్థితిలో కనపడటం వెంటనే తిరుపతి అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అటవీ శాఖకు చెందిన శంకర్ వచ్చి గరుడ పక్షిని ఎస్వీ జూకు తరలించారు. వైద్యం అందించి కోలుకున్న తరువాత శేషాచలంలో వదులుతామని ఫారెస్టు అధికారి శంకర్ తెలిపారు. పురాణాలలో చెప్పినట్లు తిరుమలలో గరుడ సేవ రోజు గరుడ పక్షి కనపడటం శ్రీవారి మహిమేనని స్థానికులు పేర్కొంటున్నారు.


Updated Date - 2020-09-23T19:45:56+05:30 IST