గణనీయంగా తగ్గిపోయిన శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య

ABN , First Publish Date - 2021-05-05T13:56:50+05:30 IST

తిరుమల: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 5 వేల లోపే ఉండటం గమనార్హం.

గణనీయంగా తగ్గిపోయిన శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య

తిరుమల: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 5 వేల లోపే ఉండటం గమనార్హం. నిన్న స్వామివారిని 4723 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 2669 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలిపిరి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా భక్తులను టీటీడీ అనుమతించనుంది.

Updated Date - 2021-05-05T13:56:50+05:30 IST