తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి 52 లక్షలు

ABN , First Publish Date - 2020-10-21T16:49:35+05:30 IST

తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి 52 లక్షలు

తిరుమల: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం హనుమంత వాహనసేవ జరిగింది. మధ్యాహ్నం పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి కొలువుదీరనున్నారు. రాత్రి గరజ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.కోటి 52 లక్షలని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 17,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 3,873 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.  


Updated Date - 2020-10-21T16:49:35+05:30 IST