‘కట్టడి ప్రాంతం’గా తిరుమల!
ABN , First Publish Date - 2020-07-10T08:24:01+05:30 IST
తిరుమలను కట్టడి ప్రాంతంగా చేస్తున్నారనే ప్రచారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
తిరుమల/తిరుపతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తిరుమలను కట్టడి ప్రాంతంగా చేస్తున్నారనే ప్రచారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలోని కంటోన్మెంట్ జోన్ల వివరాలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. అందులో తిరుమల పేరు ఉండడంతో నిమిషాల వ్యవధిలోనే ఈ సమాచారం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. కానీ.. అప్రమత్తమైన అధికారు లు గంట తర్వాత తిరుమల కంటైన్మెంట్ జోన్లో లేదని ప్రకటించారు.