తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-10T13:52:45+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 5 వేల లోపు మంది భక్తులు మాత్రమే స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు.

తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 5 వేల లోపు మంది భక్తులు మాత్రమే స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు. నిన్న 4,934 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 57 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2,216 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. లడ్డూ ప్రసాద విక్రయాలు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో నిత్యం 3 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. కాగా.. ఇప్పుడు 40 వేల లడ్డూలకే టీటీడీ పరిమితం చేసింది.

Updated Date - 2021-05-10T13:52:45+05:30 IST