తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2021-08-02T13:56:06+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం తిరుమల శ్రీవారిని 20,796 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం తిరుమల శ్రీవారిని 20,796 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.34 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 10,099 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.