తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-01-18T14:03:43+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 35,333 మంది భక్తులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 35,333 మంది భక్తులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.52 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 12,252 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.