ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
ABN , First Publish Date - 2022-01-22T05:23:48+05:30 IST
ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
వరంగల్ కలెక్టరేట్, జనవరి 21: పౌషికాహార లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల లేదని, ఆహార భద్రత చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కె.తిరుమల రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లా డుతూ ఈ చట్టం ద్వారా లబ్ధిదారులకు కల్పించిన హక్కులను భంగపరిచిన వారిపై చర్యలు తీసుకోవ చ్చన్నారు. ప్రాథమిక సౌకర్యాలు పొందుటకు విజిలెన్స్ కమిటీ అధ్యక్షులైన కలెక్టర్ సహకారం అందిం చాలని కోరారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం సహరిస్తుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్ రావు, నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.