తిరుపతమ్మ ఆలయంలో పంచాంగ శ్రవణం
ABN , First Publish Date - 2021-04-14T06:07:23+05:30 IST
పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవస్థానంలో ఉగాది సందర్బంగా పంచాంగ శ్రవణం జరిగింది.
పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవస్థానంలో ఉగాది సందర్బంగా పంచాంగ శ్రవణం జరిగింది. పండితులు ప్లన నామ సంవత్సరంలో వివిధ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను వివరించారు. ఈవో మూర్తి వారిని సత్కరించారు. యాదవులు, దాసరి సంఘీయులు వేర్వేరుగా అమ్మవారికి బోనాలను సమర్పించారు. మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి లక్ష్మీ నర సింహాస్వామి, కల్యాణ వేంకటేశ్వరస్వామి, గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వరస్వామి ఆలయాల్లో పంచాంగ శ్రవణాలు జరిగాయి.