త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేటు రైలు
ABN , First Publish Date - 2020-09-20T16:37:47+05:30 IST
చెన్నై-తిరుపతి నడుమ ప్రైవేటు రైలుకు గ్రీన్సిగ్నల్ లభించింది.చెన్నై-తిరుపతితో..
చెన్నై(ఆంధ్రజ్యోతి): చెన్నై-తిరుపతి నడుమ ప్రైవేటు రైలుకు గ్రీన్సిగ్నల్ లభించింది.చెన్నై-తిరుపతితో పాటు ఎర్నాకుళం- కొచ్చివెల్లి మార్గాల్లో రెండు ప్రైవేటు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై-తిరుపతి మధ్య నడిచే రైలు వారానికి ఒకరోజు , ఎర్నాకుళం- కొచ్చివెల్లి నడుమ వారానికి మూడు రోజులు నడవనున్నాయి. తిరుపతి రైలు శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి బయల్దేరి 10.30గంటలకు తిరుపతి చేరుకుం టుంది. తిరిగి తిరుపతిలో ఆదివారం ఉదయం 9.40గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ రైలు అరక్కోణం, రేణిగుంట స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. రైళ్ల సమయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని దక్షిణ రైల్వే తెలియజేసింది.