తిరుపతి రుయా ఆస్పత్రిలో అయోమయం

ABN , First Publish Date - 2020-08-05T03:41:52+05:30 IST

రుయాలో ఆస్పత్రిలో అయోమయ పరిస్థితి నెలకొంది. వెదురుకుప్ప మండలం మొండి వెంగన్నపల్లికి చెందిన అబ్బులయ్య మంగళవారం...

తిరుపతి రుయా ఆస్పత్రిలో అయోమయం

తిరుపతి: రుయాలో ఆస్పత్రిలో అయోమయ పరిస్థితి నెలకొంది. వెదురుకుప్ప మండలం మొండి వెంగన్నపల్లికి చెందిన అబ్బులయ్య మంగళవారం ఉదయం చనిపోయాడని బంధువులకు ఆస్పత్రి వర్గాలు సమాచారమిచ్చాయి. అయితే అబ్బులయ్య కేస్ షీట్‌లో మరో వ్యక్తి మరణం వివరాలు నమోదు అయి ఉంది. ఆదివారం నుంచి అబ్బులయ్య మొబైల్ స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో రుయా మార్చురీలో వెతికినా అబ్బులయ్య ఆచూకీ దొరకలేదు. దీంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుపై మండిపడ్డారు. అబ్బులయ్య ఆచూకీ లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-08-05T03:41:52+05:30 IST