Tirupati: ప్రమాదపు అంచున రాయల చెరువు
ABN , First Publish Date - 2021-11-22T14:00:25+05:30 IST
భారీ వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేశాయి. వరద ఉధృతికి రాయల చెరువు ప్రమాదపు అంచున నిలిచింది.
తిరుపతి: భారీ వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేశాయి. వరద ఉధృతికి రాయల చెరువు ప్రమాదపు అంచున నిలిచింది. వరద ప్రవాహానికి చెరువు కట్ట నుంచి మట్టి జారిపోతుండటంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. 18 గ్రామాల ప్రజలను పద్మావతి నిలయానికి తరలించారు. ముందు జాగ్రత్తలో భాగంగా హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. రాయల చెరువు తూముల నుంచి భారీగా వరద దిగువకు చేరుతోంది. మళ్లీ వర్షం రాకపోతే ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు. రామాపురం దగ్గర 6 అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెరువు కట్ట దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం భారీగా పోలీసు బలగాలను సిద్ధం చేశారు.