Tirupatiలో ఏపీ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-14T16:48:59+05:30 IST
ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ తిరుపతి నగరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది.
తిరుపతి: ‘‘ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు’’ అంటూ నగరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది. కోమల్ రెడ్డి సర్కిల్ నుండి ఎంఆర్పల్లె కూడలి వరకూ విద్యార్ధులతో ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తే ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని... ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర సహేతుకంగా లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ అభివృద్ధి పోరాట సమితి డిమాండ్ చేశారు.