Tirupatiలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-02T16:41:22+05:30 IST

నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Tirupatiలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్

తిరుపతి: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన 20- 20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... క్రికెట్ బిట్టింగ్ రాయుళ్లపై దాడి చేసి అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన వారు కోనేటి వీధికి చెందిన షేక్ ఆఫ్రిద్, వైకుంటపురం చెందిన మునిరత్నం, విజయ భవన్ హోటల్‌లో పనిచేస్తున్న నవీన్‌గా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఈస్ట్ ఎస్ఐ జయ స్వాములు తెలిపారు.

Updated Date - 2021-11-02T16:41:22+05:30 IST