జగన్ తెచ్చిన ‘చెత్త’ జీవోను భోగి మంటల్లో వేసిన తిరుపతి వాసులు

ABN , First Publish Date - 2022-01-14T16:54:55+05:30 IST

‘చెత్త’ పన్ను వేస్తు తెచ్చిన చెత్త జీవో కాపీలను తిరుపతి వాసులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు.

జగన్ తెచ్చిన ‘చెత్త’ జీవోను భోగి మంటల్లో వేసిన తిరుపతి వాసులు

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘చెత్త’ పన్ను వేస్తు తెచ్చిన చెత్త జీవో కాపీలను తిరుపతి వాసులు భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పనికిరాని వస్తువులను భోగి మంటలో వేయడం సంప్రదాయం. చెత్తపై పన్ను విధిస్తూ తీసుకువచ్చిన జీవో కూడా చెత్తతో సమానమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ ఆధ్వర్యంలో భోగి రోజున నిరసన తెలిపారు.

Updated Date - 2022-01-14T16:54:55+05:30 IST