కేసీఆర్‌కు షాక్ ఇచ్చే యోచనలో కోదండరామ్!

ABN , First Publish Date - 2020-07-30T02:34:38+05:30 IST

ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది కచ్చితంగా చట్ట సభలోకి అడుగు పెడతారాని దాదాపు ..

కేసీఆర్‌కు షాక్ ఇచ్చే యోచనలో కోదండరామ్!

ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చే ఏడాది  కచ్చితంగా చట్ట సభలోకి అడుగు పెడతారాని దాదాపు అన్ని వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కోదండరామ్ గెలుపు ఖాయమంటున్నాయి. ఆయన తొలిసారి బరిలోకి దిగే ఎన్నికల్లో సమాజం ఆయన వెన్నంటే నడుస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. 


తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయనను టీఆర్ఎస్ పక్కన పెట్టింది. నిజానికి కోదండరామ్ కు చట్ట సభల్లోకి వెళ్లాలన్న కోరిక ఉండేది. ఆయన రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ ఆ కల నెరవేరలేదు. గత ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి కోదండరామ్ బరిలోకి దిగాలనుకున్నారు. అయితే రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. మొదట ప్రొఫెసర్ గా, ఆ తర్వాత మానవ హక్కుల నేతగా సేవలందించారు. ఆ తర్వాత టీజేఏసీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమంలో కధం తొక్కారు. ప్రస్తుతం తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నా టీజాక్ చైర్మన్ గానే రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 

Updated Date - 2020-07-30T02:34:38+05:30 IST