భువనగిరిలో కోదండరాం ప్రచారం

ABN , First Publish Date - 2020-12-05T14:16:59+05:30 IST

వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భువనగిరిలో ప్రచారం నిర్వహించారు.

భువనగిరిలో కోదండరాం ప్రచారం

యాదాద్రిభువనగిరి: వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భువనగిరిలో ప్రచారం నిర్వహించారు.  శనివారం ఉదయం పట్టణంలో జూనియర్ కళాశాలలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి కోదండరాం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నిక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు వెల్లడి అవుతాయని కోదండరాం స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతోంది. వరంగల్- నల్గొండ - ఖమ్మం స్థానంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పోటీచేయబోతున్నట్లు టీజేఎస్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-05T14:16:59+05:30 IST