త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు టీఎంసీ తహతహ!

ABN , First Publish Date - 2021-08-04T17:57:53+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని...

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు టీఎంసీ తహతహ!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టకరిపించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పుడు 2023లో జరగబోయే త్రిపుర ఎన్నికలపై దృష్టి సారించింది. త్రిపురలోనూ బీజేపీకి తమ సత్తా చాటాలని మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ తహతహలాడుతోంది. ఈ నేపధ్యంలోనే టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ త్రిపురలో పర్యటించారు. అక్కడ ఆయన విద్యార్థులను కలుసుకున్నారు. త్రిపురలోని సమస్యలన్నింటిపైనా ఇకపై టీఎంసీ ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. టీఎంసీ నేతలు కుణాల్ ఘోష్, సమీర్ చక్రవర్తి కూడా త్వరలో త్రిపురలో పర్యటించనున్నారు. 



Updated Date - 2021-08-04T17:57:53+05:30 IST