కోవిడ్ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు: సీఎం స్టాలిన్

ABN , First Publish Date - 2021-05-12T22:20:29+05:30 IST

కోవిడ్ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు: సీఎం స్టాలిన్

కోవిడ్ పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకాలు: సీఎం స్టాలిన్

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు తమిళనాడు ముఖ్యమంత్రి కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పనిచేసే వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను తమిళనాడు సర్కారు ప్రకటించింది. తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తరువాత సీఎం ఎంవి స్టాలిన్ కోవిడ్-19 మహమ్మారి సమయంలో పనిచేసే వైద్య నిపుణులకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు కోవిడ్ -19 రోగులకు చికిత్స చేసే వైద్యులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 30,000, నర్సులకు రూ. 20,000, ఇతర కార్మికులకు రూ. 15,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుందని సీఎం తెలిపారు. అదనంగా పీజీ విద్యార్థులకు (హౌస్ సర్జన్లు) మరియు ట్రైనీ వైద్యులకు ప్రోత్సాహకాలుగా రూ. 20,000 ఇవ్వబడుతుందని సీఎం వెల్లడించారు.

Updated Date - 2021-05-12T22:20:29+05:30 IST