మంత్రిని కలిసిన టీఎన్జీవో నాయకులు
ABN , First Publish Date - 2020-10-20T07:19:48+05:30 IST
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను యన క్యాంపు కార్యాలయం వద్ద టీఎన్జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు
సుభాష్నగర్, అక్టోబరు 19: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను యన క్యాంపు కార్యాలయం వద్ద టీఎన్జీవో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి టీఎన్జీవోల సంఘ భవనానికి రావాలని ఆహ్వానించారు. మీ సమస్యలను విని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు వినతి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి మడిపల్లి కాళీచరణ్గౌడ్, జిల్లా సహాధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మీందర్సింగ్, రూరల్ కార్యదర్శి మారుపాక రాజేజ్ భరద్వాజ్, తిమ్మాపూర్ అధ్యక్షుడు మామిడి రమేశ్, జిల్లా నాయకులు రమేశ్గౌడ్, అమరేందర్ రెడ్డి, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.