సీఎం కేసీఆర్‌ను కలుస్తాం: టీఎన్జీఓ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-12-07T00:27:27+05:30 IST

త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని టీఎన్జీఓ

సీఎం కేసీఆర్‌ను కలుస్తాం: టీఎన్జీఓ అధ్యక్షుడు

హైదరాబాద్: త్వరలోనే సీఎం కేసీఆర్‌ను కలుస్తామని టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్‌ తెలిపారు. ఉద్యోగుల విభజన రాష్ట్ర స్థాయి కమిటీ ఛైర్మన్ వికాస్ రాజ్‌ను కలిశామన్నారు. మంగళవారం నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి అప్షన్స్‌ను తీసుకొని నెలాఖరులోపు విభజన పూర్తి చేయాలని కోరామన్నారు. జిల్లా స్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభమయ్యాక జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విధివిధానాలు వస్తాయన్నారు. కేసీఆర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ ఇవ్వాలని కోరతామన్నారు. 




Updated Date - 2021-12-07T00:27:27+05:30 IST