సచివాలయాల్లో రికార్డులు ఉండాలి
ABN , First Publish Date - 2020-09-23T09:56:43+05:30 IST
అన్ని గ్రామ సచివాలయాల కార్యదర్శులు సిటిజన్ చార్టర్ ప్రకారం సంబంధిత శాఖల వారీగా రికార్డులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.
ఉంగుటూరు,సెప్టెంబరు 22: అన్ని గ్రామ సచివాలయాల కార్యదర్శులు సిటిజన్ చార్టర్ ప్రకారం సంబంధిత శాఖల వారీగా రికార్డులు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కైకరం గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ కార్డులు వేలి ముద్రలు పడని వారి వివరాలు సేకరించి వలంటీర్ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల న్నారు. సిబ్బందిని సమన్వయపరచి సమస్యలు పరిష్కరించు కోవాలని పంచాయతీ కార్యదర్శి నీలం ప్రసాద్కు సూచిం చారు.ఆయన వెంట తహసీల్దార్ ఇ. జాన్ రాజు, ఎంపీడీ వో విజయలక్ష్మి,ఈవోపీఆర్డీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.