ముంచిన గండి
ABN , First Publish Date - 2020-09-25T11:55:43+05:30 IST
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోపాలపురం-వాదాలకుంట మధ్య ప్రవహిస్తున్న తాడిపూడి ఉప కాల్వకు భారీ గండి పడింది. ఈనెల 15వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై, చెరువులు నిండి రోడ్లపై ప్రవహించిన విషయం తెలిసిందే
తాడిపూడి కాల్వ చెంతన కొట్టుకుపోయిన నారుమళ్లు
మరోసారి వరద వస్తే అంతే.. గండి పూడ్చాలని రైతుల వినతి
గోపాలపురం, సెప్టెంబరు 24 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోపాలపురం-వాదాలకుంట మధ్య ప్రవహిస్తున్న తాడిపూడి ఉప కాల్వకు భారీ గండి పడింది. ఈనెల 15వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమై, చెరువులు నిండి రోడ్లపై ప్రవహించిన విషయం తెలిసిందే. వరద నీటి ప్రభావంతో సమీపంలో ఉన్న పొగాకు నారుమడులు కొట్టుకుపోయాయి.
గండిపడి పక్షం రోజులు కావస్తున్నా ఇరిగేషన్ అధికారులు కనీసం గండిపూడ్చే ప్రయత్నం చేయలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాల్వకు నీరు వదిలితే మరోసారి నారుమడులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్నున్నారు. అధికారులు స్పందించి తాడిపూడి ఉపకాల్వకు పడిన గండిని వెంటనే పూడ్చాలని రైతులు కోరుతున్నారు.