ఏపీటీఎఫ్‌ మాజీ నాయకుడు రవికుమార్‌ మృతి

ABN , First Publish Date - 2020-10-30T12:04:04+05:30 IST

ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.రవికుమార్‌ (73) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు.

ఏపీటీఎఫ్‌ మాజీ నాయకుడు రవికుమార్‌ మృతి

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 29 : ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.రవికుమార్‌ (73) గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. ద్వారకా తిరుమల మండల ఎంఈవోగా, జి.పంగిడి గూడెం జడ్పీ హైస్కూలు హెచ్‌ఎంగా పనిచేసిన ఆయన 2005లో ఉద్యోగ విరమణ చేశారు. రిటైర్డ్‌ అయిన అనంతరం కూడా సంఘ కార్య కలాపాల్లో చురుగ్గా పని చేస్తూ ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖకు మార్గనిర్దేశకులుగా ఉంటూనే పౌర హక్కుల సంఘంలో బాధ్యతలు నిర్వర్తించారని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌ రాజు తెలిపారు. రవికుమార్‌ మృతి పట్ల సంఘ నాయకులు నరసింహరాజు, రెడ్డిదొర, రమారావు, సతీశ్‌, షేక్‌ ఉమర్‌ అలీషా, తదితరులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-10-30T12:04:04+05:30 IST