వైసీపీ ప్రభుత్వానిది సంక్షోభ శకం

ABN , First Publish Date - 2021-08-22T01:00:56+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానిది సంక్షేమ శకం కాదని, సంక్షోభ శకమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

వైసీపీ ప్రభుత్వానిది సంక్షోభ శకం

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానిది సంక్షేమ శకం కాదని, సంక్షోభ శకమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పథకాలను ఎత్తేసి వారిని వైసీపీ అణగదొక్కుతుందన్నారు.  హుద్ హూద్ తుఫాన్ తరువాత విశాఖపట్నం అభివృద్ధి చంద్రబాబు చలవే అని మంత్రి అవంతి విస్మరించకూడదని ఆయన గుర్తు చేశారు. మంత్రి అవంతిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చే ధైర్యం ఉందా అని గోపాల్ సవాల్ విసిరారు. అభివృద్ధికి నిర్వచనం చంద్రబాబు అయితే, అధోగతికి చిరునామాగా జగన్ రెడ్డి మారారని ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. 


Updated Date - 2021-08-22T01:00:56+05:30 IST